English | Telugu

ఒకే కారులో ఆ ఇద్దరు... బాయ్ ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన శ్రీముఖి!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో ఉదయభాను కూడా కనిపించింది. 150th ఎపిసోడ్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అలాగే కేక్ కూడా కోశారు. ఇక ఈ ప్రోమోలో గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి సర్ అలియాస్ ముఖేష్ గౌడ కూడా కనిపించాడు. ఇక సుహాసిని కూడా వచ్చి జ్యూస్ తాగుతూ "శ్రీముఖి నువ్వు ఎన్ని చెక్కులు తీసుకున్నావో నేను కూడా అన్ని కూడా ఇంచుమించు అన్ని చిక్కులే తీసుకున్నాను" అని చెప్పింది. "అంటే వాళ్ళు చేసి తీసుకున్నారు నువ్వు చెయ్యకుండా తీసుకున్నావు" అంటూ ఇమ్మానుయేల్ సుహాసినికి కౌంటర్ వేసాడు. అలాగే అమూల్య గౌడ, బాలు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ లో నటిస్తున్నారు. ఇద్దరూ కలిసి వచ్చేసరికి శ్రీముఖికి మండిపోయింది. "ఆయనతో పాటు ఎందుకు కలిసొచ్చారో" అని మూతి తిప్పుతూ అడిగింది. దానికి ఇమ్ము "ఒకే కార్ లో వచ్చామ్ నీకు ఆ సంగతి తెలీదనుకుంటా" అనేసరికి శ్రీముఖి షాకైపోయింది.

ఇక శ్రీముఖికి బాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఐతే గుప్పెడంత మనసు హీరో ముఖేష్ వచ్చేసరికి "నీ కళ్ళ ముందు అతనికి బ్రేకప్ చెప్పాలా" అని అడిగింది. "ఇప్పటికిప్పుడే" అని ముఖేష్ అన్నాడు. "బాలు బ్రేకప్" అంటూ శ్రీముఖి సీరియస్ గా చెప్పింది. "ఆల్రెడీ ముఖేష్ తో బ్రేకప్ చేసుకునే వచ్చారు కదా" అన్నాడు బాలు. దానికి శ్రీముఖి ఆమ్మో అంటూ నవ్వేసింది. ఇక తర్వాత బాలు "పది నిమిషాల క్రితం వరకు నాకు శ్రీముఖి అంటే ఇష్టం కానీ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసారు" అన్నాడు ఫీలవుతూ. "కంగ్రాట్యులేషన్స్ అని హగ్ చేసుకుని కూడా చెప్పొచ్చు" అంటూ బాలుకి సీరియస్ గా చెప్పింది శ్రీముఖి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.